అక్షరటుడే, కామారెడ్డి: POCSO Case | పోక్సో కేసు నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2023 మే 6న నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
POCSO Case | బాలికపై కన్నేసి..
విచారణలో అదే గ్రామానికి చెందిన శేఖర్ అప్పటికే వివాహితుడు అయినప్పటికీ మైనర్ బాలికపై కన్నేసి, ఆమె కుటుంబానికి ఆస్తి ఎక్కువగా ఉందని గమనించి.. దక్కించుకోవాలనే ఉద్దేశంతో కుట్ర పన్నాడు. ఈ క్రమంలో నిందితుడు బాలిక ఫోన్ నంబర్ సంపాదించి తరచూ మాట్లాడుతూ నమ్మకం కలిగించి ఎవరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2023 మే 6న మధ్యాహ్నం బాలిక తల్లి పిట్లం మార్కెట్కు వెళ్లిన విషయం తెలుసుకుని ఇంటికి వచ్చి మాయమాటలు చెప్పి బాలికను తనతో పాటు వర్ని మండలంలోని బడాపహాడ్కు తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టాడు. అనంతరం బాలికను హైదరాబాద్కు తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు బాలిక ఆచూకీ తెలుసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించగా.. పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి వీవీఆర్ వరప్రసాద్ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Country Bomb Incident | సదాశివనగర్లో కలకలం.. నాటుబాంబు పేలి గేదెకు గాయాలు..

