అక్షరటుడే, వెబ్డెస్క్: Musi River Cleanup | మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. శనివారం ఆయన మంచిరేవులలో మాట్లాడారు. కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం మూసీ ప్రాజెక్ట్ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఆరు నూరైనా మూసీ ప్రాజెక్ట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు.
మంచిరేవులలో సీఎం రేవంత్రెడ్డి శనివారం పర్యటించారు. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం, ఆధునిక గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్ల వ్యయంతో 8 ఎకరాల్లో ఆలయం నిర్మించనున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయం నిర్మించనుండగా.. వంద అడుగులతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడారు. చారిత్రాత్మక ఆలయ పునరుద్ధణ చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
Musi River Cleanup | ఎంతో నష్టపోయాం
మూసీ నది (Musi River)ని ప్రక్షాళన చేయాలని చాలా మంది ముఖ్యమంత్రులు ప్రయత్నించారన్నారు. అవి ముందుకు సాగలేదన్నారు. తాము మాత్రం విమర్శలు వచ్చిన, అడ్డంకులు వచ్చిన తాము మూసీ ప్రాజెక్ట్ చేపడుతామన్నారు. రాష్ట్రంలో నది జలాలను సరైన రీతిలో వినియోగించుకోకపోవడంతో కొన్ని తరాలు నష్టపోయాయని ఆవేదన సీఎం వ్యక్తం చేశారు. నదులను మనం కలుషితం చేశామన్నారు. మానవ తప్పిదంతో జరిగిన కలుషితం అయిన మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రస్తుతం ఢిల్లీ (Delhi)లో కాలుష్యంతో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్కు ఆ పరిస్థితి రాకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
Musi River Cleanup | ఆ శివుడే కాపాడుతాడు
ఓంకారేశ్వ ఆలయ (Omkareshwar Temple) నిర్మాణంతో మూసీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుడుతామని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్ట్కు ఎదురయ్యే అడ్డంకుల నుంచి ఆ శివుడే కాపాడుతాడని చెప్పారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో పాతబస్తీలో మసీద్ కడతామన్నారు. అలాగే సిక్కుల కోసం ఓ ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఉప్పల్, నాగోల్ ప్రాంతంలో చర్చిని కడతామన్నారు. రామప్ప ఆలయ నమూనాతో మంచిరేవులలో గుడి నిర్మిస్తామన్నారు. గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
Musi River Cleanup | గోదావరి జలాలు తీసుకొస్తాం
గోదావరి జలాలను మూసీకి తీసుకొస్తామని సీఎం తెలిపారు. 20 టీఎంసీలను హైదరాబాద్ (Hyderabad) నగరానికి తరలించి తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : Osmania Biscuits Adulteration | క్యాన్సర్ కారకాలతో ఉస్మానియా బిస్కెట్ల తయారీ

