అక్షరటుడే, వెబ్డెస్క్: Ethanol Usage India | ఇథనాల్ వినియోగంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇథనాల్ వాడకం (Use of Ethanol) పెరిగితే.. రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. అలాగే ముడి చమురు దిగుమతులపై భారతదేశం ఆధారపడటం తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ కలుపుతున్నారు. ఇక నుంచి దానిని 20శాతానికి పెంచనున్నారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడానికి సహకరించిన చెరుకు రైతులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
Ethanol Usage India | భారం పడకుండా చర్యలు
పెట్రోల్ (Petrol)లో ఇథనాలు కలపకపోయి ఉంటే మనం విదేశాల నుంచి 4.5 కోట్ల బ్యారెళ్లు అంటే 700 కోట్ల లీటర్లు దిగుమతి చేసుకోవలసి వచ్చేదన్నారు. ఈ నిర్ణయంతో దేశ రైతులకు మేలు జరిగిందని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు చేపట్టినట్లు మోదీ తెలిపారు. యుద్ధం ఎఫెక్ట్తో అనేక దేశాల్లో ఆహార పదార్థాలు, పెట్రోల్, ఎరువులు, ఇతర నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగాయన్నారు.
Ethanol Usage India | యూపీ అభివృద్ధి
నోయిడాలో అతిపెద్ద సెమీకండక్టర్ ఫ్యాక్టరీని ఇటీవల ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. ఇక్కడి నుంచే మీరట్ మెట్రో విస్తరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఓ ఉదాహరణ అన్నారు. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లపై ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును ఆలస్యం చేయడానికి వారే కారణమని ఆరోపించారు.
Ethanol Usage India | ఏటీఎంలా వాడుకున్నారు
ఎస్పీ నాయకులు దోపిడీ కోసం నోయిడాను ఒక ఏటీఎంలా వాడుకున్నారని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏళ్ల తరబడి విమానాశ్రయ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయని విమర్శించారు. నోయిడా (Noida)ను సందర్శిస్తే ఓడిపోతామని సమాజ్వాదీ పార్టీ నాయకులు ఇక్కడకు రావడానికి భయపడేవారన్నారు.
ఇది కూడా చదవండి..: Indigo Emergency Landing | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
