అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad outsourcing salary scam | నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల(Nizamabad municipal corporation) జీతభత్యాలు పెద్ద స్కాంలాగా కనిపిస్తోందని.. దీనిపై కచ్చితంగా పూర్తి విచారణ జరగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Gupta) డిమాండ్ చేశారు. నగర పాలక సంస్థ బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
Nizamabad outsourcing salary scam | రెవెన్యూ పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (outsourcing employees) అని అన్నారు. ఈ ప్రాంతంలో రెవెన్యూ పెంచుకొనే (salary scam) అవకాశం ఎక్కువగా ఉందని, తమ పార్టీ కార్పొరేటర్లు (Nizamabad news) దీనికి పూర్తిగా సహకరిస్తారన్నారు. అర్బన్లో పన్నుల పరంగా ఇప్పటికే రూ.100 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా పన్నుల్లో చాలా తేడా ఉందని వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశానికి ముందు, ఒక అవగాహన సమావేశం నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Nizamabad outsourcing salary scam | ఉద్యోగులకు కార్పొరేటర్లు అంటే విలువే లేదు..
ప్రధానంగా నగరపాలక సంస్థ ఉద్యోగులు, సిబ్బందికి కార్పొరేటర్లు అంటే విలువ లేకుండా పోయిందని ఎమ్మెల్యే అన్నారు. ఏదైనా సమస్యలపై (budget meeting) కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్లినా.. ఫోన్లో సంప్రదించినా పట్టించుకోవడం లేదన్నారు. చిన్న జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో సుందరీకరణ (Telangana politics) జరుగుతుందని, కానీ నిజామాబాద్లో మాత్రం జరగడం లేదన్నారు. ప్రధానంగా బడ్జెట్, ఖర్చుల్లో తేడా ఉందని వాటిని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొత్తం రూ.30 కోట్లు అంటే ప్రతి డివిజన్కు రూ.50 లక్షల నిధులు ఉంటాయన్నారు. కానీ అవి ఖర్చు కావడం (civic issues) లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, ఫ్లోర్ సెక్రెటరీ మఠం పవన్ తదితరులు పాల్గొన్నారు.


