- ప్రారంభ ధర రూ.10.49 లక్షలు
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ రిటైల్ సంస్థ పీపీఎస్ మోటార్స్ హైదరాబాద్లోని కూకట్పల్లి మరియు ఎల్బీ నగర్ షోరూమ్లలో ఈ అత్యాధునిక ఎస్యూవీని ఆవిష్కరించింది. రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్ఫారమ్ (RGMP)పై నిర్మితమైన ఈ వాహనం అద్భుతమైన ఆఫ్రోడ్ సామర్థ్యంతో పాటు రోజువారీ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మార్చి 31, 2026 వరకు R-పాస్ ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకునే వారికి రూ.10.29 లక్షల ప్రత్యేక ప్రారంభ ధర వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది.
ఈ కొత్త డస్టర్ శక్తివంతమైన టర్బో TCe 160 ఇంజిన్ను కలిగి ఉండి 163 పీఎస్ శక్తిని అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ మరియు వెట్ క్లచ్ డీసీటీ గేర్బాక్స్ ఎంపికలు ఉన్నాయి. వాహన అంతర్గత భాగంలో గూగుల్ ఆటోమోటివ్ సేవలతో కూడిన మల్టీమీడియా సిస్టమ్, పానోరామిక్ సన్రూఫ్, 17 ADAS ఫీచర్లు మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక వసతులు ఉన్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేలా 7 ఏళ్ల ‘రెనాల్ట్ ఫరెవర్’ వారంటీని కూడా సంస్థ ప్రకటిస్తోంది.
ఈ కార్యక్రమంలో పీపీఎస్ మోటార్స్ ఎండీ రాజీవ్ సంగ్వీ మాట్లాడుతూ పాత డస్టర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ సరికొత్త సాంకేతికతతో ఈ మోడల్ను తెచ్చామని తెలిపారు. అలాగే ఈ-టెక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్కు కూడా భారీ డిమాండ్ ఉందని, నగర ప్రయాణాల్లో ఇది 80 శాతం వరకు ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందని వివరించారు. ఇప్పటికే బుకింగ్లు ప్రారంభమైన నేపథ్యంలో మార్కెట్లో తమ స్థానం మరింత బలపడుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
