అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR land controversy | మజీ మంత్రి కేటీఆర్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendhar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారన్నారు.
బీఆర్ఎస్ (BRS) హయాంలో భారీగా భూ కబ్జాలు, ఆక్రమణలు జరిగాయాని దానం నాగేందర్ ఆరోపించారు. తన తండ్ర కష్టపడి సంపాదించిన భూమిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు అన్ని ఉన్నాయన్నారు. కావాలంటే స్పీకర్ ముందు ముందుపెడతానని చెప్పారు. హైదరాబాద్లో పుట్టి పెరిగినా ఏం చేయలేక నోరు మూసుకున్నామన్నారు. తాము, తమ కుటుంబ సభ్యులం ఎంతగానో నష్టపోయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేల ఎకరాల భూ కబ్జాలు జరిగాయని ఆరోపించారు. వాటి అన్నింటిపైనా హౌస్ కమిటీ (House Committee) వేయాలని డిమాండ్ చేశారు.
KTR land controversy | రూ.200 కోట్ల భూమి కబ్జా
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం వరంగల్ సిటీ సెంటర్లో 200 కోట్ల ప్రాపర్టీ కబ్జా (KTR land controversy | ) చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఆధారాలు తెచ్చి మాట్లాడుతున్నాని చెప్పారు. తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే 24 గంటల్లో పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. హరీశ్ రావు, కేటీఆర్లకు దమ్ముంటే ఇది నిజం కాదని నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. కోట్లు కోట్లు కొల్లగొట్టిన దొంగలే దొంగ అని మొత్తుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయాల పేరిట విలువైన భూములను దోచుకున్నవారు ఈ రోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో గత పదేండ్లు వేల ఎకరాల భూస్కాం జరిగింది. నా సొంత భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు అన్ని ఉన్నాయి. కావాలంటే మీ ముందుపెడతా.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నన్నుబిఆర్ఎస్ వాళ్ళు నోరు మూసుకొని ఉండేలా చేశారు. మేము, మా కుటుంబ సభ్యులం ఎంతగానో… pic.twitter.com/7vzCPNWzni
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) March 29, 2026
దీనిని కూడా చదవండి : Kaushik Reddy controversy | ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై ప్రభుత్వం సీరియస్.. చర్యలు తీసుకునే అవకాశం
