అక్షరటుడే, వెబ్డెస్క్: North Korea | ఉత్తర కొరియా ఇటీవల క్రూజ్ క్షిపణుల పరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రయోగం చేపట్టింది. ఉత్తర కొరియా మీడియా నివేదికల ప్రకారం.. హై-థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ మిస్సైల్ ఇంజిన్ పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. దీనిని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ పరీక్షను అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకునే దీర్ఘకాలిక సామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అడుగుగా భావిస్తున్నారు.
North Korea | కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలో..
ఉత్తర కొరియా చేపట్టిన ఈ పరీక్షలను కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. హై-థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ సాంకేతికతతో తయారైన ఈ ఇంజిన్.. ఉత్తర కొరియా దీర్ఘ శ్రేణి మిస్సైల్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని విశ్లేసకులు అంచనా వేస్తున్నారు. ఇది దేశం అంతర్జాతీయ బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.
North Korea | ఆధునీకరణలో కొత్త మైలురాయి
పాంగాంగ్ తన మిస్సైల్ ఆయుధాలను నిరంతరం అప్గ్రేడ్ చేసుకోవడానికి చేపడుతున్న చర్యల్లో ఇది కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, న్యూక్లియర్ వార్హెడ్లను మోసుకెళ్ల గల అంతర్జాతీయ బాలిస్టిక్ మిస్సైళ్ల ద్వారా అమెరికా ఖండాంతర భూభాగాన్ని లక్ష్యంగా చేసుకునే లక్ష్యంతో దీనిని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరీక్షలు ఉత్తర కొరియా సైనిక సాంకేతికత పురోగతి చెందుతోంది.
VIDEO | North Korea tests high-thrust missile engine, signals push to target US mainland.
Kim Jong Un oversaw the test of a high-thrust solid-fuel missile engine, in a move seen as advancing North Korea’s capability to strike the US mainland, state media reported on Sunday.
The… pic.twitter.com/ZPhNstbcyB
— Press Trust of India (@PTI_News) March 29, 2026
ఇది కూడా చదవండి..: Iran attacks | కువైట్, దుబాయ్పై ఇరాన్ దాడులు
