అక్షరటుడే, వెబ్డెస్క్ : Vijay driver son | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే అభ్యర్థుల్లో తన వ్యక్తిగత డ్రైవర్ అయిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు విరుగంబాక్కం నియోజకవర్గం టికెట్ కేటాయించారు. తనకు టికెట్ ఇవ్వడంతో శబరినాథన్ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటాలని టీవీకే చీఫ్ విజయ్ భావిస్తున్నారు. ఈ మేరకు 234 స్థానాల్లో ఆయన అభ్యర్థులను ప్రకటించారు. విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ డ్రైవర్, ప్రస్తుత పీఏ అయిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ (Sabarinathan)కు కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వడం గమనార్హం. టికెట్ ప్రకటించగానే రాజేంద్రన్, ఆయన కుమారుడు శబరినాథన్ భావోద్వేగానికి గురయ్యారు.
Vijay driver son | డ్రైవర్ నుంచి పీఏగా..
రాజేంద్రన్ ప్రస్తుతం విజయ్ పీఏగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో చాలా కాలం పాటు విజయ్ డ్రైవర్గా పని చేశారు. విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి శబరినాథన్ను బరిలో నిలవనున్నారు. దీంతో శబరినాథన్ విజయ్ పాదాలకు నమస్కరించి, ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Vijay driver son | రెండు స్థానాల నుంచి..
ఎన్నికలలో తాను పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ఆదివారం విజయ్ ప్రకటించారు. ప్రజలతో నిలబడే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశానని చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIDMK) మధ్య పోరు ఉండనున్నట్లు సమాచారం. అయితే టీవీకే ప్రభావం సైతం అధికంగా ఉండనుంది. కొన్ని స్థానాల్లో విజయం సాధించడంతో పాటు, మరికొన్ని స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
