అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajagopal Reddy criticism | మునుగోడు ఎమ్మెల్యే (Munugode MLA) కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి ప్రభుత్వం విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఆదివారం అసెంబ్లీలో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం.. ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొడంగల్ను అభివృద్ధి చేసుకున్నట్లు, తనకు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండదా అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గానికి లిఫ్ట్లు తరలిస్తున్నారన్నారు. తన నియోజకవర్గ ప్రజలు కూడా తనను అడుగుతారని, వారికి తాను ఏదైనా చేయకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.
Rajagopal Reddy criticism | అందరు కలిస్తేనే ప్రభుత్వం
ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి, మంత్రులు మాత్రమే కాదని కోమటిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అన్నారు. నిధుల కోసం రేవంత్ రెడ్డి చుట్టూ, మంత్రుల చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. ప్రాంతాలు, నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దని కోరారు. అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Rajagopal Reddy criticism | ఖమ్మం జిల్లాకే..
నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని ప్రచారం జరుగుతున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి పదే పదే నిధులు తీసుకుపోతా అన్నప్పుడు.. మునుగోడు ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనను గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి : Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన టీవీకే చీఫ్ విజయ్
