అక్షరటుడే, ఇందూరు: Nizamabad Murder Case | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న Akbar Bagh ప్రాంతంలో ఆదివారం ( మార్చి 29) రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించాడు.
Nizamabad Murder Case | గొడ్డలితో నరికి..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సదరు యువకుడిని గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో మెడపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న 6th Town పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికంగా పరిస్థితిని సమీక్షించారు.
ముమ్మరంగా గాలింపు..
హతుడు అక్బర్ బాగ్ ప్రాంతానికి చెందిన అక్షయ్ గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీజ్ చేసి ఆధారాలను సేకరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్లో దాచి!
