అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Warning Police | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు అక్రమాలకు సహకరించే పోలీసు అధికారులకు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పొంగులేటి అనుచరులు ప్రహరీ కూలుస్తుంటే, పోలీసులు పక్కన కూర్చొని టిఫిన్ తింటున్నారట అన్నారు. రెండున్నరేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని, అక్రమాలకు సహకరించే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో పర్యటించారు. కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉందన్నారు. గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయని చెప్పారు. సతీష్ షా కుటుంబానికి చెందిన భూమి సుమారు రూ.1400 కోట్ల విలువ కలిగి ఉండగా, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కన్నుపడిందని ఆరోపించారు.
KTR Warning Police | మంత్రి బెదిరించారు
మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్మెంట్కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన కుటుంబం ఒప్పుకోకపోవడంతో మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారన్నారు. రెవెన్యూ అధికారులతో తో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. అంతేగాకుండా అక్కడ నిర్మించిన గోశాలను సైతం కూల్చివేశారన్నారు.

KTR Warning Police | బదిలీ చేశారు
ఈ ఘటనపై బాధితులను పోలీసులకు ఫిర్యాదు చేశారని కేటీఆర్ తెలిపారు. దీంతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను ప్రభుత్వం బదిలీ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోందన్నారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
KTR Warning Police | కఠిన చర్యలు తీసుకోవాలి
అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని కేటీఆర్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Drug Bust | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన రైల్వే ఉద్యోగి
