అక్షరటుడే, వెబ్డెస్క్: Food Adulteration Control | రాష్ట్రంలో ఆహార కల్తీని నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రణ కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడతామని చెప్పారు.
Food Adulteration Control | ప్రజాప్రతినిధులకు సన్నబియ్యంతో భోజనం
రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయింది. 3.39 కోట్ల మందికి పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాల్లో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు.
Food Adulteration Control | పేదలకు సన్న బియ్యం పంపిణీ
ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. రేషన్ షాపుల (Ration Shops) ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేరన్నారు. దీంతో ఈ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందన్నారు. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడడం లేదని వివరించారు. అందుకే పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు.
Food Adulteration Control | క్వింటాలుకు రూ.500 బోనస్
పేదలకు బియ్యం పంపిణీ చేసేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించామని ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేశామని పేర్కొన్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వాణిజ్య, ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి..: KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
