అక్షరటుడే, హైదరాబాద్: Telangana BJP Executive | తెలంగాణ (Telangana)లో సంస్థాగత బలాన్ని పెంచేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రామచంద్రరావు నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తృతంగా పునర్వ్యవస్థీకరించారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao) తాజాగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల జాబితాను ప్రకటించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో విస్తృత ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టినట్లు అధ్యక్షుడు వెల్లడించారు.
Telangana BJP Executive | కార్యవర్గం వివరాలు ఇలా…
రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 116 మందిని నియమించారు.
రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులుగా 62 మందిని ఎంపిక చేశారు.
రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక శాశ్వత ఆహ్వానితులుగా 20 మందికి అవకాశం ఇచ్చారు.
పార్టీకి కీలకంగా భావించే ప్రజాప్రతినిధులను కూడా కార్యవర్గంలో చేర్చారు. భారతీయ జనతా పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను రాష్ట్ర కార్యవర్గానికి శాశ్వత ఆహ్వానితులుగా తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ విధానాలపై, ప్రజా సమస్యలపై చర్చలు మరింత సమర్థవంతంగా జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Telangana BJP Executive | కీలక మార్పులు..
రాష్ట్ర కార్యవర్గంలో ప్రాంతీయ సమతుల్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడం విశేషం. పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా మార్చే లక్ష్యంతో విభిన్న విభాగాల నాయకులను కార్యవర్గంలో చేర్చుకున్నారు.
ఇది కూడా చదవండి..: Paraquat Ban Telangana | పారాక్వాట్ బ్యాన్.. ఈ గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం!
