అక్షరటుడే, వెబ్డెస్క్: Midnight Heavy Rain | అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో ఆరబెట్టిన పంటలు తడిసిపోయాయి.
రాష్ట్రంలో వారం రోజులుగా ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి భానుడు కాస్త శాంతించాడు. అయితే వరుణుడు తన ప్రతాపం చూపాడు. సోమవారం పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. అర్ధరాత్రి కొన్ని జిల్లాల్లో భారీ వర్షం పడింది.
Midnight Heavy Rain | ఆ జిల్లాల్లో
తెలంగాణ (Telangana)లోని నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్లాలో వాన దంచికొట్టింది. ఆ జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సైతం వర్షం పడింది. మంగళవారం సైతం పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. అక్కడక్కడ వడగళ్ల వాన పడే ఛాన్స్ ఉంది.
Midnight Heavy Rain | రైతులకు నష్టం
అకాల వర్షాలతో రైతులు (Farmers) తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరబెట్టిన ధాన్యం, పసుపు తడిసిపోయింది. కోతకు వచ్చిన సమయంలో వర్షాలతో వడ్లు నేలరాలయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతం అయి ఉంది. చలిగాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: Telangana BJP Executive | శాశ్వత ఆహ్వానితులు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు
