అక్షరటుడే, బోధన్ : Hanuman Jayanti Rally | పట్టణంలో నిర్వహించే హనుమాన్ జయంతి ర్యాలీలో డీజేలకు పర్మిషనల్ లేదని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో ర్యాలీ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు.
Hanuman Jayanti Rally | వివిధ సంఘాలతో ప్రత్యేక సమావేశం..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ర్యాలీలో పాటించాల్సిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా వివరించారు. ప్రతిఒక్కరూ ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనాలన్నారు. ఇతరులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఎవరైనా చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్ జయంతి (Hanuman Jayanti) శోభాయాత్రను గతేడాది మాదిరిగానే అనుమతి ఉన్న రూట్లోనే నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. కొత్త రూట్లకు అనుమతి లేదన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని.. ర్యాలీకి సంబంధించిన సమాచారాన్ని వారి ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. డీజేలు, డ్రోన్లకు అనుమతి లేదన్నారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్ (Bodhan ACP P. Srinivas), బోధన్ ఎస్హెచ్వో వెంకట్ నారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు, హిందూ ధర్మ ప్రచార మండలి ప్రతినిధులు ప్రవీణ్ గుప్తా, ఆర్గనైజషన్ గోపి, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి హరికృష్ణారెడ్డి, మారుతి మందిరం పూజారి ప్రవీణ్ మహారాజ్, లయన్స్ క్లబ్, బజరంగ్దల్, ఆర్య సమాజ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu Arrangements | గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
