అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Crime Gang | దేశంలో రోజురోజుకూ సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్ల పేరిట సైబర్ దొంగలు ప్రజల ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి ఈ ముఠాలు పని చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పోలీసులు ఓ ముఠా గుట్టురట్టు చేశారు.
కాంబోడియా (Cambodia), మయన్మార్ (Myanmar), వియత్నాం కేంద్రంగా సైబర్ మోసాలు చేస్తున్నారు. చైనాకు చెందిన వారు ఈ ముఠాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్లో ఏజెంట్లను నియమించుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. విశాఖలో రిటైర్డ్ ఉద్యోగికి డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ దొంగలు మోసం చేశారు.
Cyber Crime Gang | కొరియర్లో డ్రగ్స్ అని..
సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడికి ఫోన్ చేశారు. ఆయన పేరిట వచ్చిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టారు. తాము కర్ణాటక క్రైమ్ డిపార్ట్మెంట్ (Karnataka Crime Department)కు చెందిన పోలీసులం అని చెప్పారు. దీంతో భయపడిన సదరు వృద్ధుడు వారు చెప్పినట్లు చేశాడు. దశల వారీగా నిందితులు చెప్పిన ఖాతాలో రూ.1.05 కోట్లు జమ చేశాడు. మళ్లీ డబ్బులు కావాలని వారు అడగడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.
Cyber Crime Gang | నిందితుల అరెస్ట్
వృద్ధుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సైబర్ నేరగాళ్ల స్థానిక ఏజెంట్లు సూర్య శ్రవణ్, సాయి దీపక్, రాజేష్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం విశాఖ పోలీసులు (Visakhapatnam Police) దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. Udan Yatri Cafe | ఎయిర్పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్
