అక్షరటుడే, వెబ్డెస్క్: Chicken shops bandh Telangana | తెలంగాణ (Telangana)లోని మాంసం ప్రియులకు ఇది బ్యాడ్న్యూస్. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు (Chicken shops) మూతపడనున్నాయి. చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసనకు పిలుపునిచ్చింది. బుధవారం నుంచి బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Chicken shops bandh Telangana | మార్జిన్ తగ్గించడంతో..
పౌల్ట్రీ కంపెనీలు (Poultry Companies) తమకు ఇచ్చే మార్జిన్ తగ్గించాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో తాము తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Chicken shops bandh Telangana | రూ. 26 నుంచి రూ. 16కు..
ఫౌల్ట్రీ కంపెనీలు గతంలో రిటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చేవని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ (Chicken Shop Owners Association) తెలిపింది. గత 20 ఏళ్లుగా 26 రూపాయలే మార్జిన్ ఉందని.. కానీ ఇటీవల రూ. 16కు తగ్గించాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం కేజీ చికెన్కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తోంది.
Chicken shops bandh Telangana | వినియోగదారులకు ఇబ్బందులు
చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరింంచాలని వ్యాపారులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Bike Stunt Case | పోలీసుల ముందు బైక్తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
