అక్షరటుడే, బాన్సువాడ: Mahalakshmi scheme success | పట్టణంలోని బస్టాండ్లో మహాలక్ష్మి పథకం (Mahalakshmi scheme)విజయవంతమైన సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla Pocharam) హాజరయ్యారు.
Mahalakshmi scheme success | మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం..
పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను (free bus travel) ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 2023 డిసెంబర్ 9న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం (Telangana government schemes) విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 290 కోట్ల మహిళా ప్రయాణాలు ఉచితంగా జరిగాయన్నారు. దాంతో మహిళలు దాదాపు రూ.10 వేల కోట్ల ప్రయాణ ఖర్చును (social welfare programs) ఆదా చేసుకున్నారని తెలిపారు. అలాగే బాన్సువాడ డిపో పరిధిలో మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి 2026 మార్చి 30 వరకు సుమారు 2.42 కోట్ల మహిళా ప్రయాణాలు(women empowerment India) నమోదయ్యాయని వివరించారు. దాంతో ప్రయాణికులు రూ.90.32 కోట్ల మేర ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ వేడుకల సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాసుల రోహిత్, కృష్ణారెడ్డి, గంగాధర్, ఎజాజ్, ఖాలెక్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Toll Plaza New Rules | వాహనదారులకు కీలక అప్డేట్.. రేపటి నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధన..
