అక్షరటుడే, మాక్లూర్: Makloor society dispute | మాక్లూర్ సొసైటీలో (Makloor society) ఏర్పాటు చేసిన మహాజన సభ రసాభాసగా మారింది. సొసైటీలో (cooperative society news) అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు పట్టుబడ్డారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Makloor society dispute | రూ.3.5 కోట్ల అక్రమాలు
సొసైటీ కార్యాలయంలో ప్రత్యేకధికారి ఫిరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముందుగా ఎజెండా అంశాల(rural politics) వారీగా కార్యదర్శి రతన్ సొసైటీ అప్పులు, ఆస్తుల గురించి వివరించారు. సభ్యులు మాత్రం గతంలో జరిగిన అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. రూ.3.5 కోట్లు అక్రమంగా దోచుకున్న గత పాలక వర్గం నుంచి ఒక్క రూపాయి వసూలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బాకీ ఉంటే ఇంట్లో వస్తువులు బయటపెట్టే సిబ్బంది పాలకుల విషయంలో మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.
Makloor society dispute | స్పష్టమైన హామీ వచ్చే వరకు..
ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన సమాధానం ఇచ్చేవరకు సమావేశం నిర్వహించవద్దని సభ్యులు అడ్డుకున్నారు. బాకీపడ్డ వారి ఇళ్లముందు బాధితులమైన(governance issues) సభ్యులం బైటాయించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. నెలరోజుల్లో అవినీతికి(farmers issues India) పాల్పడ్డ వారిపై చర్యలు ఉంటాయని వారి ఆస్తులు అటాచ్ చేసే ప్రక్రియ త్వరలో (Telangana news) ప్రారంభం అవుతుందని అధికారిణి స్వప్న సభ్యులకు వివరించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విఠల్ రావ్, సొసైటీ మాజీ ఛైర్మన్ అశోక్, పలు గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి
