అక్షరటుడే, న్యూఢిల్లీ: India census 2027 | దేశవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యం కలిగిన జనగణన ప్రక్రియ నేడు ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి విడత జనగణన నిర్వహిస్తారు.
India census 2027 | తొలి విడతలో గృహ గణన
తొలి విడతలో గృహ గణన (House Listing), నివాసాల వివరాలు సేకరిస్తారు. ఇందులో ఇంటి పరిస్థితులు, సౌకర్యాలు, కుటుంబం వంటి కీలక సమాచారాన్ని నమోదు చేస్తారు.
రాష్ట్రాల వారీగా షెడ్యూల్ను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్లో మే 1వ తేదీ నుంచి మే 30 వరకు గృహ గణన ఉంటుంది. తెలంగాణలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
India census 2027 | సహజీవనంలో..
జనగణనలో ఈసారి కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా.. సహజీవనం (Live-in Relationship)లో ఉన్న జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది సామాజిక మార్పులను ప్రతిబింబించే కీలక నిర్ణయంగా మేధావులు భావిస్తున్నారు.
ప్రజలు పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు. సరైన సమాచారం అందిస్తే.. భవిష్యత్లో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ డేటా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
