అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market Recovery | పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ (Stock Market)లో బుధవారం రిలీఫ్ ర్యాలీ కనిపిస్తోంది. ఈరోజు బేర్స్పై బుల్స్దే పైచేయిగా కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లు (Global Markets) పాజిటివ్గా ఉండడం, అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం వంటి అంశాలు కలిసొచ్చాయి.
Stock Market Recovery | భారీ లాభాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,815 పాయింట్లు, నిఫ్టీ 568 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 73,546 పాయింట్లనుంచి 73,917 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 22,809 నుంచి 22,937 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత నిఫ్టీ 50 ఇండెక్స్లో అన్ని స్టాక్స్ లాభాలతో సాగుతున్నాయి. ఇండిగో 8.52 శాతం, బీఈఎల్ 6.86 శాతం, ట్రెంట్ 6.63 శాతం, అదాని పోర్ట్స్ 4.95 శాతం, టీసీఎస్ 4.66 శాతం లాభాలతో ఉన్నాయి. అన్ని ఇండెక్స్ లూ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.
Stock Market Recovery | మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే..
రెండు, మూడు వారాల్లో ఇరాన్పై సైనిక దాడులను ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతోపాటు యుద్ధం ముగించడానికి అమెరికాతో సందేశాలు పంపించుకున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ ధ్రువీకరించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మెరుగుపరచింది. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 10 శాతానికిపైగా పడిపోయాయి. గత రెండు సెషన్లలోనే భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో బ్లూచిప్ స్టాక్స్లో వాల్యూ బయ్యింగ్ కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధర కొంత తగ్గడం, రూపాయి బలపడడంతో మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి.
బుధవారం తొలి అరగంటలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 13 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 412 లక్షల కోట్లనుంచి రూ. 425 లక్షల కోట్లకు చేరింది.
ఇది కూడా చదవండి..: ITR Forms | ఐటీఆర్ ఫారాలను నోటిఫై చేసిన కేంద్రం
