అక్షరటుడే, వెబ్డెస్క్ : PACS Bank Employees Drunk | సహకార బ్యాంక్ (Cooperative Bank)ను కొందరు ఉద్యోగులు బార్గా మార్చారు. ప్రజలకు సేవలు అందించాల్సిన చోట.. అర్ధరాత్రి వేళ మద్యం సిట్టింగ్ వేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లో చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పీఏసీఎస్ బ్యాంకు (PACS Bank)లో, అర్ధరాత్రి ఛైర్మన్ ఛాంబర్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి ఉద్యోగులు మద్యం తాగారు. బ్యాంకు ఉద్యోగులు దళారుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి లోన్లు మంజూరు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
PACS Bank Employees Drunk | వీడియో వైరల్
రాత్రిపూట బ్యాంక్లో బజ్జీలు తింటూ.. ఉద్యోగులు మందు తాగుతున్న వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్గా మారింది. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కార్యాలయాన్ని బార్గా మార్చారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఛైర్మన్ చాంబర్లోనే మద్యం తాగడం గమనార్హం. రైతులు, వినియోగదారులు వివిధ పనుల నిమిత్తం వెళ్తే విసుక్కునే అధికారులు.. ప్రైవేట్ వ్యాపారులతో మాత్రం మద్యం సిట్టింగ్లు వేస్తుండటం గమనార్హం. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Kondagattu temple accident | కొండగట్టులో అపశృతి.. 15 మంది భక్తులకు గాయాలు
