అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka bus accident | కర్ణాటక (Karnataka )లోని హవేరీ సెంట్రల్ బస్టాండ్లో విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు ప్లాట్ఫామ్పైకి దూసుకెళ్లడంతో రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటకలోని హవేరి బస్టాండ్ (Haveri bus stand) వద్ద బుధవారం తెల్లవారుజామున బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ బస్సును నడుపుతున్న ఒక డ్రైవర్ ప్రయాణికులను ఢీకొట్టడంతో, రెండున్నర ఏళ్ల బాలుడు బస్సు కింద నలిగి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు.
మృతుడిని సావనూరు నివాసి అయిన హజ్రత్ అలీ ఇస్మాయిల్ రాయచూర్గా గుర్తించారు. ఆ బాలుడిని కర్ణాటక మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందాడు.
Karnataka bus accident | యాక్సిలేటర్ నొక్కడంతో..
బస్సు డ్రైవర్ (Karnataka bus accident) మంజునాథ్ బస్సును ప్లాట్ఫారమ్ వద్ద పార్క్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రెయినీ డ్రైవర్ బ్రేక్కు బదులుగా యాక్సిలరేటర్ను పొరపాటున గట్టిగా నొక్కడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ బస్సు హవేరి నుంచి లక్ష్మేశ్వర్కు వెళ్లాల్సి ఉంది.
గాయపడిన బాధితులను బాంకాపూర్కు చెందిన వాసుదేవ్ గురునాథప్ప ఉటలేకర్ (44), ఆయన కుమార్తె హర్ష ఉటలేకర్ (6), భార్య కావ్యంజలి ఉటలేకర్ (39), సావనూరుకు చెందిన అర్బాజ్ ఖాన్ సౌదాగర్ (13)గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A government bus suddenly ran over passengers waiting for a bus at the Haveri Central Bus Stand platform in Karnataka, killing a 2-year-old innocent child in a horrific accident.#karnataka #busaccident #viralvideos #trending #news pic.twitter.com/bnBrRHUixg
— bhavdip (@bhavdip2149) April 1, 2026
దీనిని కూడా చదవండి : Murder Accused Arrest | హత్య కేసులో నిందితుడిని పట్టించిన సిలిండర్ బుకింగ్
