అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Mosquito Menace | హైదరాబాద్లో పెరుగుతున్న దోమల బెడదను ఎత్తిచూపుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (BRS MLA Sudheer Reddy) వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దోమల వలతో తయారు చేసిన దుస్తులను ధరించి ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్దకు దోమ తెరను, ఫాగింగ్ మిషన్ను సుధీర్ రెడ్డి తీసుకొని వెళ్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నగరంలో నోరు తెరిచిన వెంటనే దోమలు నోట్లోకి వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ (Hyderabad) నివాసితులు ఇప్పుడు “తమకు తామే దోమల వలలు కుట్టుకోవాల్సిన” పరిస్థితి వచ్చిందని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.
Hyderabad Mosquito Menace | చర్యలు చేపట్టాలి
హైదరాబాద్లో దోమల బెడదను నివారించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విఫలమైందని ఆయన విమర్శించారు. హైదరాబాద్లోని ప్రతి డివిజన్కు 10 ఫాగింగ్ యంత్రాలను అందించాలని డిమాండ్ చేశారు. దోమల నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే నగర ప్రతిష్ట మరింత దెబ్బతింటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువుల్లో దోమలు పెరగకుండా 5 పద్ధతుల్లో దోమలను, వాటి గుడ్లను నాశనం చేసే వాళ్లమని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని విమర్శించారు. దోమల బెడదతో ప్రజలు మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులతో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Rotten Meat Racket | హైదరాబాద్లో కల్తీ మాంసం కలకలం.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం
