అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Doddi Komarayya Jayanthi | తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అన్నారు. కలెక్టరేట్ (Collectorate)లో శుక్రవారం దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Doddi Komarayya Jayanthi | పోరాటంలో ప్రభావశాలిగా నిలిచి..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (Additional Collector Kiran Kumar) మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభావశీలిగా నిలిచారన్నారు. ఆనాటి దేశముఖ్ల అసంబద్ధ పాలనకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలతో పోరాటం జరిపారని గుర్తుచేశారు. కొమరయ్య పోరాట స్ఫూర్తితో తెలంగాణా (Telangana)లో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయని, ఈ ఉద్యమాలకు కొమరయ్య పోరాటపటిమ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మహనీయుల కృషిని స్మరించుకునేందుకు, నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలనే ఆకాంక్షతో ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలియజేశారు. మహనీయులు చూపిన బాటలో నడుస్తూ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడడమే మనం వారికి అందించే నిజమైన నివాళి అని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల నాయకులు లక్ష్మణ్, దేవన్న, షేక్ హుస్సేన్, బంగారు సాయిలు, నరాల సుధాకర్, రాజేశ్వర్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: GG Hospital Fire | జీజీహెచ్లో అగ్నిప్రమాదం..
