అక్షరటుడే, వెబ్డెస్క్ :WhatsApp Impersonation Fraud | సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలను బురిడీ కొట్టించడానికి ఆధునికే సాంకేతికతను వాడుకుంటున్నారు. బడా కంపెనీలే లక్ష్యంగా ఇటీవల మోసాలకు తెర లేపారు. వీటిపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు.
వ్యాపార సంస్థల అధినేతలు, సీఈవోలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త Whatsapp Impersonation Fraud కు తెరలేపారని సజ్జనార్ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్కు హానికరమైన ఫిషింగ్ లింకులను నిందితులు పంపుతారు. అనంతరం కంప్యూటర్లలోకి మాల్వేర్ను ప్రవేశపెట్టి, సిస్టమ్స్పై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్ను పొందుతున్నారు.
WhatsApp Impersonation Fraud | సందేశాలు పంపి..
సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి సీఈఓ, సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తున్నారు. తాము అత్యవసర సమావేశంలో ఉన్నానని, ఫోన్ ఎత్తడం వీలుపడదని నమ్మబలుకుతున్నారు. తాము చెప్పిన అకౌంట్కు వెంటనే డబ్బులు పంపాలని సందేశాలు పంపుతున్నారు. దీంతో ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు తమ బాస్ చెప్పారనుకొని వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా కోట్లాది రూపాయలను తక్షణమే సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారు.
WhatsApp Impersonation Fraud | జాగ్రత్తగా ఉండాలి
వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓల ఫోన్ నంబర్ల నుంచే సందేశాలు వస్తుండటంతో నిజమేనని అకౌంటెంట్లు డబ్బును పంపుతున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలో ఇటువంటి కేసులు పెరిగాయి. దీంతో ప్రతి కంపెనీ కూడా అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఇటీవల మాజీ డీజీపీ మనవరాలు ఇదే తరహాలో మోసపోయిన విషయం తెలిసిందే. వాట్సాప్లో డబ్బు పంపమని కంపెనీ పెద్దలు మెసేజ్ చేస్తే.. అకౌంటెంట్లు ఒకసారి ఫోన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలని సీపీ సూచించారు.
ఇది కూడా చదవండి..: Footpath Encroachment Drive | ఫుట్పాత్ ఆక్రమణలపై కొరఢా
