అక్షరటుడే, వెబ్డెస్క్: Family Suicide Attempt | ఓ వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కుటుంబంతో కలిసి తనువు చాలించాలని సిద్ధం అయ్యాడు. అయితే ఆ విషయం పోలీసులకు తెలియడంతో అతడి కుటుంబాన్ని కాపాడారు.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో చోటు చేసుకుంది.పల్నాడు జిల్లా దుర్గి మండల (Durgi Mandal) కేంద్రానికి చెందిన శ్రీపతి అమరేంద్ర, త్రివేణి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే అప్పులు ఎక్కువ కావడంతో అమరేంద్ర చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుందామని భార్యను ఒప్పించాడు. అనంతరం స్నేహితుడి వద్ద కారు తీసుకొని దానిలో కుటుంబాన్ని ఎక్కించుకొని బయలుదేరాడు. అయితే తాము ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్న విషయాన్ని త్రివేణి తన మామకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Family Suicide Attempt | ట్రేస్ చేసి..
సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారు కోసం గాలించారు. సంతమాగులూరు (Santhamaguluru) నుంచి నరసరావుపేట వైపు వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. గుంటూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలో వారి కారును గుర్తించారు. అనంతరం దంపతులను ప్రశ్నించగా.. తాము ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లడం లేదని వారు బుకాయించారు. అయితే పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో తాము ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినట్లు అంగీకారించారు. వారికి పోలీసులు సర్ది చెప్పి ఇంటికి పంపించారు.
ఇది కూడా చదవండి..: Badam Milk Incident | జాతరలో వికటించిన బాదం పాలు.. 80 మందికి అస్వస్థత, ఆసుపత్రుల్లో చికిత్స
