అక్షరటుడే, వెబ్డెస్క్ : High Court Zone 2 | రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ (CJI Suryakanth), సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy), హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం పర్యటించారు. హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
బుద్వేలులో కొత్తగా హైకోర్టు భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ పనులను సీఎం, సీజేఐ పరిశీలించారు. రెండో దశలో భాగంగా న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులతో బుద్వేలులో హైకోర్టు నూతన భవనం నిర్మిస్తున్నారు. 100 ఎకరాల్లో భవనం పనులు చేపడుతున్నారు.
High Court Zone 2 |అన్ని వసతులతో..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడారు. న్యాయవ్యవస్థ గొప్పతనం గురించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తాను గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. కోర్టు భవనం నిర్మించే అవకాశం తనకు దక్కడం అదృష్టమన్నారు. గతంలో కొందరు నాయకులు హైకోర్టు నిర్మాణం కోసం ప్రయత్నించినప్పటికీ.. కొన్ని కారణాలతో ముందుకు సాగలేదన్నారు. తాము అన్ని వసతులతో నూతన భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : BRS Municipal Victory | క్యాతన్పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్
