Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఆయా దేశాల్లోని ప్రజలు నిత్యం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందని వణికిపోతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల సామాన్య ప్రజలు పడుతున్న అవస్థలపై కవి డి.శ్రీరామ్ కవిత రూపంలో తన ఆవేదనను వ్యక్త పరిచారు.
Middle East War | ‘హాహాకారాలు ఆర్తనాదాలు..’
యుద్ధోన్మాదంతో అటు అమెరికా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు అట్టుడుకుతున్నాయి..
శాంతి భద్రతలు కనుమరుగయ్యాయి..
పరస్పర బాంబుల దాడులతో మూడు దేశాల పౌరులు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ దినమొక గండం నూరేళ్ల ఆయుష్షులా గడుపుతున్నారు..
పాలకులు చేసే పాపాలకు అమాయక పౌరులు అల్లాడిపోతున్నారు..
జనావాసాల మధ్య బాంబుల వర్షంతో పౌరుల హాహాకారాలు ఆర్తనాదాలు..
యుద్ధంలో ప్రాణాలు త్యాగం చేసే సైనికులు పేదలే..
యుద్ధం వల్ల నేలకొరిగే అమాయక ప్రజలు పేదలే..
అగ్రరాజ్యం అమెరికా తీరుతో
ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి..
ఏం సాధించాలని ఈ యుద్ధ కుతూహలం..
పేదల బతుకులను చేస్తుంది చిన్నా భిన్నం
ప్రపంచ దేశాధ్యక్షులారా, మేధావులారా మొద్దు నిద్ర వీడండి యుద్ధాన్ని ఆపండి శాంతి కపోతాలను ఎగరేయండి…
– డి.శ్రీరామ్, కవి
ఇది కూడా చదవండి..: American Pilot Rescue | ఇరాన్లో అమెరికన్ పైలెట్ సేఫ్.. అతడిని రక్షించినట్లు ట్రంప్ ప్రకటన
