అక్షరటుడే, వెబ్డెస్క్: Glowing Plants China | మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతాయి. ఆక్సిజన్ను అందిస్తాయి. అయితే ఈ మొక్కలు మాత్రం కాంతిని వెదజల్లుతాయి. రాత్రిళ్లు మెరిసే మొక్కలను చైనా శాస్త్రవేత్తలు (China Scientists) అభివృద్ధి చేశారు.
చైనా శాస్త్రవేత్తలు చీకట్లో మెరవగల జన్యుపరంగా మార్పు చేసిన మొక్కలను ఆవిష్కరించారు. ఈ అద్భుత ఆవిష్కరణ పట్టణ దీపాలంకరణ, పర్యాటక రంగాలను మార్చివేయగలదని పరిశోధకులు పేర్కొంటున్నారు. జన్యు సవరణ సాంకేతికతను ఉపయోగించి ఈ మొక్కలను అభివృద్ధి చేశారు. మిణుగురు పురుగులు, కాంతినిచ్చే శిలీంధ్రాల నుంచి కాంతిని ఉత్పత్తి చేసే జన్యువులను మొక్కల కణాలలోకి బదిలీ చేసిన తర్వాత సహజమైన కాంతిని వెదజల్లే మొక్కలను తయారు చేశారు.
Glowing Plants China | మిణుగురు పురుగులతో..
మ్యాజిక్పెన్ బయో (MagicPen Bio) అనే బయోటెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకుడు లీ రెన్హాన్ మాట్లాడుతూ.. మిణుగురు పరుగుల వలే మెరిసే మొక్కలను తయారు చేయాలనే ఆలోచన తనకు వచ్చిందన్నారు. మిణుగురు పురుగుల జన్యువులను మొక్కలలోకి బదిలీ చేయాలనుకున్నామని చెప్పారు. దీంతో అవి కూడా రాత్రిపూట మెరవగలవు. ఈ సాంకేతికతను సాంస్కృతిక పర్యాటకానికి, రాత్రిపూట ఆర్థిక వ్యవస్థకు తీసుకురావడానికి మేము అంకితభావంతో ఉన్నామని వెల్లడించారు. ఈ మొక్కలను ఇటీవల జోంగువాన్కున్ ఫోరమ్ (Zhongguancun Forum)లో ప్రదర్శించారు.
ఇది కూడా చదవండి..: Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్కు ఇరాన్ వార్నింగ్
