అక్షరటుడే, వెబ్డెస్క్: RBI MPC Meeting | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాలను ప్రతి రెండు నెలలకోసారి నిర్వహిస్తుంటుంది. ఈ సమావేశాలు మూడు రోజులపాటు సాగుతాయి.
ఇందులో కీలకమైన అంశాలపై చర్చిస్తారు. ప్రధానంగా వడ్డీ రేట్లలో మార్పులు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై సమీక్షిస్తారు. చివరి రోజు ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తారు. అయితే ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది.
RBI MPC Meeting | ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు రెండుమూడు వారాలుగా బ్యారెల్కు వంద డాలర్లపైనే కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయి. ముడి చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులపైనే ఆధారపడిన మనదేశానికి క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల పెద్ద దెబ్బగా మారనుంది. క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడంతో వాణిజ్య లోటు పెరగనుంది. తయారీ పీంఎఐ నాలుగేళ్ల కనిష్టానికి చేరింది.
RBI MPC Meeting | రూ. 18 వేల కోట్లకుపైగా స్టాక్స్
మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. మార్చిలో రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించిన ఎఫ్ ఐఐలు.. ఈనెలలో రెండు సెషన్లలోనే రూ. 18 వేల కోట్లకుపైగా స్టాక్స్ విక్రయించారు. దీంతో రూపాయి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతకు మొగ్గు చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎంపీసీ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటారు, సమావేశాల అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ కుమార్ మల్హోత్రా ఎలాంటి కామెంటరీ ఇస్తారన్న దానికోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Small LPG Cylinder Demand | చిన్న సిలిండర్కు పెద్ద డిమాండ్.. రెండు వారాల్లో 6.6 లక్షల అమ్మకాలు
