అక్షరటుడే, వెబ్డెస్క్: US Israel Attack | ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ (America-Israel) సంయుక్త దాడులు చేపట్టాయి. సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్లోని జనావాసాలపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 17 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. టెహ్రాన్లోని షరీఫ్ యూనివర్సిటీ (Sharif University)పైనా దాడులు జరిగాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran)లోని తూర్పు భాగంలో జరిగిన దాడిలో మూడు భవనాలు కూలిపోయాయి. సుమారు 50 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఖలేహ్ మీర్ పట్టణంలోని రెండు నివాస సముదాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు బాంబులు వేయడంతో మరణాలు సంభవించాయని బహరెస్తాన్ గవర్నర్ (Baharestan Governor) తెలిపారు. శిథిలాల తొలగింపు, గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాజధాని టెహ్రాన్లో అర్ధరాత్రి సమయంలో పేలుళ్లు కూడా వినిపించాయి.
US Israel Attack | ఆరుగురు చిన్నారులు
టెహ్రాన్లోని ఒక నివాస ప్రాంతం, ఇతర లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఆరుగురు చిన్నారులు చనిపోయారు. టెహ్రాన్పై జరిపిన దాడుల్లో షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీని లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్లోని హైఫా నగరంపై ఇరాన్ భారీ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో పేలుడు పదార్థాలున్న వార్హెడ్లు పలు ప్రాంతాల్లో పడి, నగరం అంతటా వివిధ ప్రదేశాలలో మంటలు చెలరేగాయి. ఈ క్షిపణి దాడితో అనేక భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి..: North Korea Missile | అత్యాధునిక క్షిపణిని తయారు చేస్తున్న ఉత్తర కొరియా
