అక్షర టుడే, కమ్మర్ పల్లి: BJP Foundation Day | మండల కేంద్రంలో (kammerpalli news) సోమవారం భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని(bjp foundation day) ఘనంగా నిర్వహించారు. బీజేపీ బాల్కొండ ఇన్ఛార్జి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు, మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ గద్దె వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
BJP Foundation Day | దేశ అభివృద్ధి పీఎం మోదీతోనే సాధ్యం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీకి ముందుకు తీసుకెళ్తామన్నారు. దేశ అభివృద్ధిలో ప్రధాని మోదీ (pm modi) ఆయన కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ.. మల్లికార్జున్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల్లో బీజేపీని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, బీజేవైఎం(bjym activities) మండల అధ్యక్షుడు గణేష్, శక్తి కేంద్ర ఇన్ఛార్జి పొల్కం నవీన్, చింత ప్రవీణ్, బోగ రామస్వామి, శ్రీరాముల శ్రవణ్ కుమార్, మనోహర్, రాజేందర్, భాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: PNG Connections India | పెరిగిన పీఎన్జీ కనెక్షన్లు..
