అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Power Line Repairs | ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కారణంతో కూలిపోయిన లైన్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ (Transco CMD Krishnabhaskar) అన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి డిచ్పల్లి, సారంగపూర్ ప్రాంతాల్లో గాలుల కారణంగా పడిపోయిన 220 కేవీ టవర్లను ఆయన పరిశీలించారు.
Power Line Repairs | విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవద్దు..
బాసర వెళ్తూ తిరుగు ప్రయాణంలో భాగంగా సీఎండీ జిల్లా (CMD District)లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల కారణంగా కూలిపోయిన టవర్లను పరిశీలించారు. వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలని.. విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా ఇతర లైన్ల ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. వేసవి దృష్ట్యా డిమాండ్కు తగ్గట్లుగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్శాఖ (Electricity Department) సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎండీ వెంట ట్రాన్స్కో ట్రాన్స్మిషన్ డైరెక్టర్ సంపత్రావు, సీఈ విజయ్కుమార్, పాపారావు, ఎస్సీ పీవీరావు, డీఈలు, ఏఈడీలు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Sainyasena Organization | అధైర్య పడొద్దు.. కొడుకులా అండగా ఉంటా: ‘అక్షరటుడే’ కథనానికి స్పందించిన సైన్యసేన అధ్యక్షుడు
