అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa Land Protection | హైదరాబాద్ (Hyderabad)లోని ఐటీ కారిడార్లో హైడ్రా (Hydraa) మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది
రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్లోని సర్వే నంబర్ 55లోని 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో 4.20 ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించింది. మరో నాలుగు ఎకరాలను కొలను మాధవరెడ్డి కూతురు సబిత కబ్జా చేశారు. తాజాగా హైడ్రా అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులను తొలగించారు. ప్రభుత్వ భూమిలో నెలకొల్పిన ఆర్సీసీ ప్లాంట్ను వాసవి నిర్మాణ సంస్థ స్వయంగా తొలగించుకొని అధికారులకు సహకరించింది. హైడ్రా కాపాడిన భూమి విలువ రూ. 1,200 కోట్లు ఉంటుందని అంచనా.
Hydraa Land Protection | నిషేధితా జాబితాలో పెట్టినా..
ఖానామెట్ సర్వే నంబర్ 55 లో ఉన్న భూమి అసైన్డ్ ల్యాండ్. రంగారెడ్డి కలెక్టర్ ఈ భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. అయితే మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూమిలో 4.20 ఎకరాలు తమదని చెబుతూ వస్తోంది. అందులో ఆర్సీసీ ప్లాంటులతో పాటు.. భవన నిర్మాణ కార్మికులకు షెడ్డులు నిర్మించింది. కొలను సబిత మరో నాలుగు ఎకరాలు తనవని కబ్జాలో ఉన్నారు. ఆ భూమి బౌన్సర్లను కాపలాగా ఉంచారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమిగా నిర్దారించుకున్న తర్వాత… మంగళవారం ఆక్రమణలను తొలగించారు.
ఇది కూడా చదవండి : Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్
