అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TNGOs Employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవోస్ (TNGOs Nizamabad) ఎల్లప్పుడూ ముందుంటుందని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. భీమ్గల్ (Bheemgal) యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నికలను మండల కేంద్రంలో నిర్వహించారు. వ్యవసాయ శాఖ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ వనమాల సుధాకర్ ఎన్నికల అధికారిగా, జాఫర్ హుస్సేన్ సహాయక ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
TNGOs Employees | భీమ్గల్ యూనిట్ అధ్యక్షుడిగా..
ఈ సందర్భంగా భీమ్గల్ టీఎన్జీవోస్ యూనిట్ను (Government Staff Welfare) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనిట్ అధ్యక్షుడిగా సృజన్ కుమార్ (ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ), కార్యదర్శిగా సాయి కుమార్ గౌడ్ (వెల్ఫేర్ శాఖ) తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నాశెట్టి సుమాన్ కుమార్ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన యూనిట్ కార్యవర్గం స్థానిక ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వారి ఉన్నతికి పాటుపడాలని సూచించారు. జిల్లా టీఎన్జీవోస్ ఎల్లప్పుడూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటుందన్నారు.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ (Telangana Government Employees), టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి హుస్సేనీ తెలియజేస్తూ వారి ఆదేశాల మేరకు ఉద్యమాలకు సైతం ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా (Nizamabad News) ప్రధాన కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శశాంత్ రెడ్డి, విశాల్ టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం, జిల్లా ప్రచార కార్యదర్శి ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సునీల్, రవి, భీమ్గల్ యూనిట్ ఉద్యోగులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి : Jeevan Reddy Meet | రేపు మాజీ మంత్రి జీవన్రెడ్డి ఇంటికి కేటీఆర్
