అక్షరటుడే, వెబ్డెస్క్: Punjab Gangster Crackdown | పంజాబ్లో గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ మాఫియాపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం (Aam Aadmi Party Government) కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి భగవంత్ మన్ (CM Bhagwant Mann) ఆదేశాల మేరకు చేపట్టిన ‘యాంటీ గ్యాంగ్స్టర్’ ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా దూకుడుగా సాగుతోంది.
బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 501 ప్రాంతాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఏకంగా 202 మందిని అరెస్ట్ చేశారు. గ్యాంగ్స్టర్లకు సహకరిస్తున్న అనుచరులను, వారి నెట్వర్క్ను ఛేదించడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Punjab Gangster Crackdown | AGTFతో కలిసి సంయుక్త చర్యలు
యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ ఫోర్స్ (Anti-Gangster Task Force)తో పాటు అన్ని జిల్లాల పోలీసులు సమన్వయంతో ఈ దాడుల్లో పాల్గొన్నారు. కేవలం అరెస్టులు మాత్రమే కాకుండా, పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు కూడా చేపట్టారు. గ్యాంగ్స్టర్లతో పాటు డ్రగ్స్ మాఫియాపై కూడా ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఈ దాడుల్లో 112 మంది డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5.8 కిలోల హెరాయిన్, భారీగా మత్తు మాత్రలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ‘యాంటీ గ్యాంగ్స్టర్’ ఆపరేషన్ విజయవంతంగా 77వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలను పూర్తిగా నిర్మూలించేవరకు ఈ చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. నేరగాళ్లకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్న వారిని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
Punjab Gangster Crackdown | పంజాబ్ గ్యాంగ్స్టర్లలో భయం
వరుస దాడులతో పంజాబ్ (Punjab)లో గ్యాంగ్స్టర్లలో భయం నెలకొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, యువతను తప్పుదారి పట్టిస్తున్న గ్యాంగ్స్టర్ సంస్కృతికి చెక్ పెట్టడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. వరుసగా 77 రోజుల పాటు కొనసాగుతున్న ఈ భారీ ఆపరేషన్ పంజాబ్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచే చర్యగా మారింది. పోలీసుల ఈ దూకుడుతో నేరగాళ్లకు ఎక్కడా ఆశ్రయం దొరకకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఇది కూడా చదవండి..: Flights Parking Fee | విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట.. భారీగా పార్కింగ్ ఛార్జీల తగ్గింపు
