అక్షరటుడే, కామారెడ్డి: Farmers Compensation | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం కిసాన్ సంఘ్ ప్రతినిధులు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ (Additional Collector Victor)ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Farmers Compensation | యాసంగి పంటలైన మొక్కజొన్న, జొన్న..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగి పంటలైన మెక్కజొన్న, జొన్న పంటలు కోతకు వచ్చాయని, వెంటనే రైతులకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. యూరియాతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాప్ను రద్దుచేసి రైతులకు యూరియాను సరఫరా చేయాలని కోరారు. రైతుల విస్తీర్ణం ప్రకారం రైతు భరోసా (Rythu Bharosa) అందించాలని, ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. చెరుకు రైతుకు టన్నుకు రూ.800 బోనస్ ఇవ్వాలని, ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. మొక్కజొన్న పంట ఎకరాకు 35 క్వింటాళ్లు, జొన్న పంట ఎకరాకు 20 క్వింటాళ్లు కొనుగోలు చేయాలన్నారు. తాము విన్నవించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని, ఆలస్యమైతే రైతులు (Farmers) రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Social Service Initiative | సమాజ సేవలో ముందుండాలి: ఎమ్మెల్యే ధన్పాల్
