అక్షరటుడే, వెబ్డెస్క్ : Drug Seizure | శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad Airport)లో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి సుమారు రూ.4.6 కోట్ల విలువైన 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
థాయ్ ఎయిర్వేస్ విమానం (TG-329)లో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడిని హైదరాబాద్ (Hyderabad) కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు అడ్డుకున్నారు. అతడి లగేజీని తనిఖీ చేశారు. అందులో 22 వాక్యూమ్-సీల్డ్ ప్యాకెట్లను కనుగొన్నారు. పరీక్షల్లో అది హైడ్రోపోనిక్ గంజాయి అని నిర్ధారణ అయింది. ఏప్రిల్ 8న జరిగిన ఆపరేషన్లో ఈ స్మగ్లింగ్ ముఠా వెనుక సూత్రధారిగా అనుమానిస్తున్న మరో వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ నెట్వర్క్లోని ఇతర సభ్యులను, స్మగ్లింగ్ కార్యకలాపాల వెనుక ఉన్న అంతర్జాతీయ సంబంధాలను గుర్తించేందుకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Drug Seizure | ఈగల్ టీమ్ దాడులు
ఈగల్ టీమ్ (Eagle Team) సభ్యులు డోర్నాకల్ పోలీసులతో కలిసి నిర్వహించిన దాడిలో 26.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. దాని విలువ రూ.13.4 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణాకు వినియోగించిన వాహనాలతో పాటు ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి : Warangal crime case | వరంగల్ జిల్లాలో విషాదం.. యువతిపై హత్యాచారం!
