అక్షరటుడే, వెబ్డెస్క్: Dhar Murder Case | నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ధార్ జిల్లాలో చోటు చేసుకుంది.
ధార్ జిల్లా (Dhar District)లోని గోండిఖేడా చరణ్ నివాసి అయిన ప్రియాంక పురోహిత్, దేవకృష్ణ దంపతులు. వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. ఆ సమయంలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. అయితే భర్త నల్లగా ఉన్నాడనే కారణంతో ప్రియాంక రాజ్గఢ్ (Rajgarh)కు చెందిన కమలేష్ పురోహిత్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వారిద్దరు కలిసి బతకాలని అనుకున్నారు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో దేవకృష్ణను హత్య చేయడానికి కమలేష్ తన సహచరుడైన సురేంద్రను రూ.లక్ష సుఫారి ఇచ్చారు.
Dhar Murder Case | దోపిడీ నాటకం
సురేంద్ర ప్రణాళిక ప్రకారం దేవకృష్ణ ఇంటికి చేరుకుని, అతను నిద్రలో ఉన్నప్పుడు హత్య చేశాడు. ఆ తర్వాత అతను ప్రియాంకను కట్టేసి, వేరొక గదిలో బంధించాడు. సురేంద్ర వెళ్లిపోయిన తర్వాత, ప్రియాంక గట్టిగా కేకలు వేసింది. దొంగలు ఇంట్లోకి చొరబడి తన భర్తను చంపేశారని, తనను కట్టేసి ఆభరణాలు చోరీ చేశారని కట్టు కథ అల్లింది. ఏప్రిల్ 7న ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తీరుపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. కాల్ డేటా ఆధారంగా హత్య కేసును ఛేదించారు. నిందితులు కమలేశ్, ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సురేంద్ర పరారీలో ఉన్నాడు.
ఇది కూడా చదవండి..: Yashwant Varma Resignation | హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా
