అక్షరటుడే, వెబ్డెస్క్: ATM Theft | రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. తెల్లవారుజామున ఏకంగా ఎస్బీఐ ఏటీఎం మెషిన్ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.
ATM Theft | పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో..
వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలోకి తెల్లవారు జామున దొంగలు చొరబడ్డారు. ఏకంగా మిషన్ను వాహనంలో ఎక్కించుకుని పారిపోయారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని ఏటీఎంను దొంగలు అపహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ మహేష్, డీఎస్పీ నాగేంద్ర చారి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుల గాలింపు కోసం పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం
