అక్షరటుడే, వెబ్డెస్క్: Vijayasai Reddy Media | మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ (YSRCP) మాజీ నాయకుడు విజయ సాయి రెడ్డి మీడియా రంగంలోకి రానున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా డిజిటల్ మీడియా (Digital Media)ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
విజయ సాయిరెడ్డి వైసీపీ హయాంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. పార్టీ ఓటమి తర్వాత ఆయన అనుహ్యంగా ఆ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అంతేగాకుండా రాజకీయాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాని ఆయన సోషల్ మీడియా (Social Media)లో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియా రంగంలోకి వస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
Vijayasai Reddy Media | మూడు భాషల్లో
త్వరలో తాము తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో వార్తల కోసం ఒక డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు విజయ సాయి రెడ్డి తెలిపారు. సమతుల్యంగా, నిష్పక్షపాతంగా, సత్యానికి కట్టుబడి వార్తలు అందించడం తమ లక్ష్యమన్నారు. ప్రజల గొంతుకను వినిపించడం, సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తామన్నారు. తమ మీడియా స్వతంత్రంగా పని చేస్తుందని, ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదన్నారు. అనంతరం తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ (Telugu Satellite News Channel)ను కూడా ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ప్లాట్ఫారమ్ పేరు ప్రకటిస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: Gudivada Amarnath Sentence | మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు జైలు శిక్ష!
