అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Warning Officials | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సీఎం రేవంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 నెలల్లో రేవంత్ సాధించింది ఏమీ లేదన్నారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం తప్ప ఏం చేశారని ఎద్దేవా చేశారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతో పాటు.. సెగ్మెంట్లోని గ్రామాల్లో ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు, సర్పంచ్లను కేటీఆర్ శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRS కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక వారికి బుద్ధి చెబుతామన్నారు. ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ప్రజాస్వామ్యం అని కేటీఆర్ అన్నారు. దాన్ని నిలిపింది మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని కొనియాడారు. కాగా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మెజారిటీ రాకున్నా.. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ బీజేపీతో కలిసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
KTR Warning Officials | ఫ్యూచర్ లేని సీఎం
బీఆర్ఎస్ హయాంలో 7 ఏళ్లు కష్టపడి ఫార్మా సిటీ ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. ఆ భూముల్లో ఇప్పుడు రేవంత్రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ (Hyderabad)లో ప్రజలు దోమలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని సీఎం.. ఫ్యూచర్ సిటీ కడతారంట అని ఎద్దేవా చేశారు. 3 వేల ఎకరాల భూమిని రిలయన్స్కు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఎంకు ఫ్యూచర్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల వరకు అధికారంలోకి రాకుండా రేవంత్రెడ్డి చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారంలో నుంచి దిగి పోయాక ఆయనను చూసి కూర్చున్న కుక్క కూడా లేవదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన దుర్మార్గాలకు ప్రజలు సరైన సమాధానం చెబుతారన్నారు.
ఇది కూడా చదవండి : Kodad Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 16 మంది ప్రయాణికులకు గాయాలు
