అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Youth Drug Awareness | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నగరంలోని జీజీహెచ్లో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (Addiction Treatment Facility) గదిని ఆయన శనివారం ప్రారంభించారు.
Youth Drug Awareness | డ్రగ్స్ బారిన పడితే..
ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు సీపీ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, ఒకవేళ డ్రగ్స్కు తీసుకుంటే జీజీహెచ్ (GGH)లో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్లో చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాజశ్రీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, శ్రీలత, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాన్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ డాక్టర్ నాగమోహన్, నోడల్ ఆఫీసర్ రాజేందర్, సైకియాట్రిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Youth Drug Awareness | జీజీహెచ్లో భద్రత ఏర్పాట్లపై సమీక్ష
జీజీహెచ్లో భద్రతపై సీపీ సాయిచైతన్య సూపరింటెండెంట్ శ్రీనివాస్తో మాట్లాడారు. ఆస్పత్రిలో పార్కింగ్, సీసీ కెమెరాల పనితీరు, చిన్నారుల అపహరణ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పార్కింగ్లో ఉన్న బైక్లు చోరీ జరగకుండా భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement Centers | కోతలు ముగుస్తున్న వేళ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
