అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Women Reservation 2029 | మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు (women reservation bill) చారిత్రాత్మక నిర్ణయమని 2029 ఎన్నికల నాటికి వాటిని అమలు చేయబోతున్నామని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. ఈ మేరకు నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Women Reservation 2029 | 30 ఏళ్ల నిరీక్షణకు ప్రధారి తెర దించారు..
మహిళల 30ఏళ్ల నిరీక్షణకు ప్రధాని మోదీ (PM Modi) తెరదించారని.. వారికి ఇంతకంటే పెద్ద పండుగ ఉండదని ఎంపీ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మార్చబోయే నిర్ణయం ప్రధాని తీసుకున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లపై చట్టం చేయబోతున్నారని వివరించారు. రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరిగితే కచ్చితంగా అవినీతి తగ్గుముఖం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లు వారి హక్కు అని.. ప్రజాస్వామ్యంలో ఇవి తప్పనిసరి అని అన్నారు. దీనిని గుర్తించిన ప్రధాని చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలని పట్టుబట్టి అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Women Reservation 2029 | రాజకీయాలకు తప్ప కాంగ్రెస్ దేనికీ పనికి రాదు..
రాజకీయాలు చేయడం తప్ప కాంగ్రెస్ నాయకులకు ఏ పని చేయడం రాదని ఎంపీ అన్నారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల కోసం బీజేపీ పోరాటం చేస్తోందని.. ఎట్టకేలకు ఇప్పుడు అమలు దిశగా ముందడుగు పడిందన్నారు. డీలిమిటేషన్పై ఎలాంటి అపోహలు వద్దని అభద్రతాభావం అవసరమే లేదన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో 1,132 మంది సభ్యులు కూర్చునే విధంగా భవన నిర్మాణం జరిగిందని వివరించారు. తెలంగాణలో ఎంపీ స్థానాలు 17 నుంచి 26కు పెరిగాయని అది ప్రజల మద్దతుతోనే జరిగిందని వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు రాజకీయాల కోసం తెచ్చిన బిల్లు కాదని కేవలం మహిళల ఉన్నతి కోసమే చేస్తున్న పని అని ఆయన పేర్కొన్నారు. కారక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari), కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్స్టాగ్రామ్ కంటెంట్పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
