అక్షరటుడే, హైదరాబాద్: Kalyan Jewellers | మేడిపల్లిలో ప్రముఖ ఆభరణాల సంస్థ ‘కళ్యాణ్ జ్యువెలర్స్’ తన సరికొత్త షోరూమ్ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. తెలంగాణలో తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీలీల ఆదివారం ప్రారంభించారు. సంప్రదాయ నైపుణ్యం, ఆధునికత కలగలిసిన ఈ షోరూమ్ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించనుంది.
Kalyan Jewellers | ఆనందంగా ఉంది
ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ.. “విశ్వసనీయతకు మారుపేరైన కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. నాణ్యత, పారదర్శకతలో ఈ బ్రాండ్ ఎప్పుడూ ముందుంటుంది. మేడిపల్లి వాసులకు అద్భుతమైన ఆభరణాల డిజైన్లు ఇప్పుడు చేరువలో ఉండటం విశేషం” అని పేర్కొన్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, తెలంగాణ మార్కెట్ తమకు ఎంతో కీలకమని, ఈ ప్రాంత ప్రజల అభిరుచులకు తగ్గట్లుగా మరిన్ని వైవిధ్యమైన డిజైన్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
Kalyan Jewellers | ప్రారంభోత్సవ ఆఫర్లు, నాణ్యత
- బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ కూలీ (Making Charges) పై 50 శాతం వరకు తగ్గింపు.
- వెండి ఆభరణాలపై 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్.
- వెండి వస్తువుల తయారీ కూలీపై 25 శాతం రాయితీ.
- పరిమిత కాలం పాటు ప్రత్యేక గోల్డ్ బోర్డ్ రేట్ సదుపాయం.
కళ్యాణ్ జ్యువెలర్స్లోని ప్రతి ఆభరణం బీఐఎస్ హాల్మార్క్ కలిగి ఉండటమే కాకుండా, 4-లెవల్ అస్యూరెన్స్ సర్టిఫికేట్తో లభిస్తుంది. ఇది స్వచ్ఛతకు హామీ ఇవ్వడంతో పాటు ఉచిత లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ పారదర్శకమైన బై-బ్యాక్ పాలసీలను నిర్ధారిస్తుంది. ఈ షోరూమ్లో ముహూరత్, ముద్ర, నిమః, గ్లో, జియా, అనోఖి వంటి బ్రాండ్లతో పాటు ఇటీవల విడుదల చేసిన ‘లీల’ అనే కలర్డ్ స్టోన్స్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: Financial Plan | ధరలు పెరిగినా ఆదాయం తగ్గినా డోంట్ వర్రీ.. ఈ ఫైనాన్షియల్ టిప్స్ పాటిస్తే చాలు!
