అక్షరటుడే, వెబ్డెస్క్ : Kaleshwaram restoration | కాళేశ్వరం ప్రాజెక్ట్లోని బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
సచివాలయం కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై మంత్రి అధికారులు, సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధులు, పనులు చేపడుతున్న ఏజెన్సీలతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA), విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే గుర్తించాయని తెలిపారు. ఆయా లోపాలను సరిచేసి మరమ్మతులను పూర్తి చేయాలన్నారు. అన్నారం, సుందిళ్ల పనులను నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేయవచ్చన్నారు.
Kaleshwaram restoration | ఐఐటీ ముంబైకి బాధ్యత
కొత్త డిజైన్ల కోసం ఏఎఫ్ఆర్వై ఇండియా, ఐఐటీ ముంబై (IIT Mumbai)లకు బాధ్యత అప్పగించినట్లు మంత్రి తెలిపాఆరు. డిజైన్ బృందం వారంలో ఏడు రోజులూ, 24 గంటలూ పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరగా డిజైన్లు అందించాలన్నారు. కేంద్రం నుంచి అనుమతులు పొందడానికి సీడబ్ల్యూసీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పునరుద్ధరణ పనుల అమలుకు నాయకత్వం వహించడానికి, కల్నల్ పరిక్షిత్ మెహ్రాను కన్వీనర్గా ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమవుతుందన్నారు. పనుల పురోగతిని సమీక్షించడానికి అవసరమైతే మంత్రి కూడా పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల కార్యదర్శి శ్రీధర్, సొరంగ నిపుణుడు, కార్యదర్శి కల్నల్ పరిక్షిత్ మెహ్రా, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : KTR Criticizes Government | రాష్ట్రంలో దోచుకో.. దాచుకో స్కీం : కేటీఆర్
