అక్షరటుడే, వెబ్డెస్క్: Inter Exams 2026 | రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు. ఫస్ట్ ఇయర్ 4,89,126 మంది, సెకండియర్ 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు.
Inter Exams 2026 | రాష్ట్ర వ్యాప్తంగా 1,495 కేంద్రాలు
పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రైవేటు కాలేజీలతో పాటు 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలు ఉన్నాయి. ఎగ్జామ్స్ కోసం మొత్తం 28,500 మంది ఇన్విజిలేటర్లను నియమించగా.. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఉన్నాయి. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు హాల్ టికెట్లను tgbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి లేదంటే కాలేజీల నుంచి పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా.. డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్లను అనుమతించాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
Inter Exams 2026 | కేంద్రాల్లో పటిష్ట నిఘా..
పరీక్షల కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించబోరు. అలాగే మాల్ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. విద్యార్థుల కోసం ఎగ్జామ్ సెంటర్లో తాగునీరు, ఫర్నిచర్, వాల్ క్లాక్లు అందుబాటులో ఉంటాయి. సెంటర్ల వద్ద నిఘా కోసం సుమారు 7,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని TGBIE ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశారు.
ఇది కూడా చదవండి..: Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు

