అక్షరటుడే, వెబ్డెస్క్ : Israel Iran Tensions | ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శనివారం ఉదయం టెల్అవీవ్ టెహ్రాన్పై క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని (Supreme Leader Khamenei) నివాసానికి సమీపంలో పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇజ్రాయెల్తో పాటు అమెరికా సైతం దాడుల్లో పాల్గొంది. షీల్డ్ ఆఫ్ జూద్ (Shield of Judah) పేరుతో ఆపరేషన్ నిర్వహించాయి. 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేపట్టారు. నార్త్, ఈస్ట్ టెహ్రాన్పై బాంబుల వర్షం ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఇరాన్ అధికారులు తమ సుప్రీ లీడర్ అయేతుల్లా ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. చర్చలపై సంతృప్తిగా లేనని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. తన మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.
Israel Iran Tensions | సైరన్ల మోత
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టే అవకాశం ఉంది. దీంతో రెండు దేశాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇరాన్, ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతుంది. కార్యాలయాలకు, విద్య సంస్థలకు ఇరు దేశాలు సెలవు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అణు చర్చలు సంతృప్తికరంగా లేవన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ తమ దేశస్తులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్కు ప్రయాణాలు చేయొద్దని సూచించింది.

Israel Iran Tensions | వెంటనే దేశాన్ని వీడండి
ఇటలీ, జర్మనీ, పోలాండ్, కజకిస్తాన్, చైనాతో సహా అనేక దేశాలు తమ పౌరులు ఇరాన్ను విడిచి వెళ్లాలని కోరాయి. ఇస్తాంబుల్, టెహ్రాన్ మధ్య విమానాలు రద్దు అయ్యాయి. ఇజ్రాయెల్ దాడి తర్వాత తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసినట్లు ఇరాక్ రవాణా మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇజ్రాయెల్ కూడా పౌర విమానాలకు తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.
Israel Iran Tensions | భారత్ అడ్వైజరీ
ఇజ్రాయెల్లో ఉంటున్న భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశ అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని పేర్కొంది. సహాయం కోసం భారత ఎంబసీని సంప్రదించాలని సూచించింది.
ఇది కూడా చదవండి..: Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!

