అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Power Demand | నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGNPDCL) తన చరిత్రలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ను నమోదు చేసింది. శనివారం 6,057 MW రికార్డు స్థాయిలో గరిష్ట డిమాండ్ నమోదైందని సీఎండీ వరుణ్రెడ్డి (CMD Varun Reddy) పేర్కొన్నారు.
గత ఏడాది మార్చి 11న నమోదైన 5,816 MW గరిష్ట డిమాండ్ను ఆయన గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 6,057 MW గరిష్ట డిమాండ్ నమోదు కావడం గమనార్హం. డిమాండ్ పెరిగినప్పటికీ ముందస్తు ప్రణాళిక నిరంతర విద్యుత్ సరఫరాకు దోహదపడిందని సీఎండీ తెలిపారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
Telangana Power Demand | మౌలిక సదుపాయాల బలోపేతం
విద్యుత్ సరఫరా (Electricity Supply)ను మెరుగు పర్చడానికి 35 కొత్త 33/11 కెవి సబ్స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎండీ వరుణ్రెడ్డి తెలిపారు. 366 అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, 7,600 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచామని వెల్లడించారు. 8 ఓవర్లోడ్ 33 కేవీ ఫీడర్లను విభజించామని, 1,200 కి.మీ. 33 కేవీ ప్రత్యామ్నాయ లైన్లు వేశామన్నారు. తక్కువ వోల్టేజ్ సమస్యలను తగ్గించడానికి 392 కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Telangana Power Demand | వేసవి దృష్ట్యా
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వేసవి కాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి డివిజన్లో అత్యవసర ప్రతిస్పందన బృందాలను ఉంచామన్నారు. డిమాండ్లో మరింత పెరుగుదల ఉన్నప్పటికీ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందిస్తామని చెప్పారు. వేసవి కాలంలో వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Seed Farmers Justice | సీడ్ రైతులకు న్యాయం చేయాలి : కవిత

